మహాభారతం క్విజ్ - 7

Image Source: Google

భీముడు వాయుదేవుని అంశతో జన్మించిన కారణంగా పుట్టుకతోనే అమితబలశాలి. దుర్యోధనుడు నీటిలో పడేసి చంపడానికి ప్రయత్నిస్తే నాగలోకానికి చేరి వెయ్యి ఏనుగుల బలం వచ్చే ఆశీర్వాదంతో తిరిగి వస్తాడు. ధుర్యోధన దుశ్శాసనతో పాటు కౌరవులు వంద మందిని భీముడే వధించాడు.

భీష్ముడు తన తండ్రి శంతనుడు సత్యవతిని వివాహమాడేందుకు వీలుగా అవివాహితులుగా ఉండి రాజ్యాధికారం పొందనని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ త్యాగానికి ప్రతిగా, శంతనుడు భీష్మునికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణం అనే వరం ఇస్తాడు.

విరాటరాజు కుమారుడైన ఉత్తరుడు తమ రాజ్యంపైకి దండెత్తిన కౌరవ సేనని తాను ఒక్కడినే ఎదుర్కొనగలనని ప్రగల్భాలు పలికి అర్జునుని రధసారధిగా బయలుదేరుతాడు. కానీ, ఆ యుద్ధములో భయపడుతున్న ఉత్తరుని రధసారధ్యం చేయమని చెప్పి అర్జునుడు కౌరవ సైన్యాన్ని ఓడించాడు.

యుద్ధం తరువాత ధృతరాష్ట్రుడు భీముడిని కౌగిలించుకొను సమయంలో, కృష్ణుడు అతని ఉద్దేశాన్ని పసిగట్టి అతని స్థానంలో దుర్యోధనుని ఇనుప విగ్రహాన్ని పెట్టమంటాడు. ధృతరాష్ట్రుడు విగ్రహాన్ని ముక్కలుగా నలిపివేసి ఏడుస్తూ విలపిస్తాడు.

నిత్య పారాయణ శ్లోకాలు